బందిపొరాలో ఎన్‌కౌంటర్ - ఇద్దరు ఉగ్రవాదుల హతం

సోమవారం, 11 అక్టోబరు 2021 (08:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. 
 
గుంద్‌జహంగిర్‌ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 
 
అయితే, ఈ ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదు. దాగివున్న ముష్కరుల కోసం గాలింపు ఇంకా కొనసాగుతున్నాయి. 
 
మరో ఎన్‌కౌంటర్‌లో ఓ టెర్రరిస్టును భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సోమవారం తెల్లవారుజామున అనంత్‌నాగ్‌ జిల్లాలోని వెరినాగ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ముష్కరుల కాల్పుల్లో నలుగురు పోలీసులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు