పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మేసింది.. సిలిండర్ అమ్మి యోగిని కలిసినా?

గురువారం, 1 జూన్ 2017 (10:35 IST)
అమ్మతానికి ఆమే ఆదర్శంగా నిలిచింది. పిల్లల చదువుల కోసం ఓ తల్లి తన కిడ్నీని అమ్మకానికి పెట్టింది. యూపీలోని ఆగ్రా, రోహత ప్రాంతానికి చెందిన ఆర్తి శర్మ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లో తన కిడ్నీని అమ్మకానికి పెడుతూ తన ముగ్గురు కుమార్తెలు, కొడుకు చదువు కోసం ఈ పనిచేయక తప్పట్లేదని వాపోయింది. గార్మెంట్ షాపు నష్టాల్లో కూరుకుపోవడంతో.. పిల్లల స్కూలు ఫీజులు చెల్లించలేక ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆ తల్లి వెల్లడించింది. 
 
ఏప్రిల్ 29న ఇంట్లోని గ్యాస్ సిలిండర్‌ను బ్లాక్ మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బులతో లక్నో వెళ్లి ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిని కలిసి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిపారు. అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి సహాయసహకారాలు అందలేదన్నారు. 
 
ఆర్తి భర్త మనోజ్ శర్మ మాట్లాడుతూ.. పిల్లల చదువుల కోసం కిడ్నీని అమ్మాలని ఆమె నిర్ణయించుకుందని చెప్పారు. తాను టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, నెలకు రూ.4-5 వేలు వస్తాయని పేర్కొన్నాడు. తమకు ప్రభుత్వం సాయం చేస్తే చిన్న వ్యాపారం ప్రారంభించి పిల్లలను చదివించుకుంటామని విజ్ఞప్తి చేశారు.

వెబ్దునియా పై చదవండి