9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

సెల్వి

శనివారం, 15 ఫిబ్రవరి 2025 (17:57 IST)
రాజస్థాన్‌లోని అజ్మీర్ నుంచి తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన 17ఏళ్ల బాలికను పోలీసులు యూపీలో గుర్తించారు. మెయిన్‌పురి జిల్లాలోని ఒక గ్రామం నుండి అపహరించబడిన 17 ఏళ్ల బాలికను ఉత్తరప్రదేశ్ పోలీసులు రక్షించారు. ఆమెను ఓ వ్యక్తి విక్రయించారని.. తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడని అధికారులు తెలిపారు. 
 
సమీపంలోని గ్రామంలో నివసించిన నీరజ్, మెయిన్‌పురిలోని ఒక కోచింగ్ సెంటర్‌కు వెళుతుండగా బాలికను అపహరించి, అజ్మీర్‌కు తీసుకెళ్లి, విష్ణు మాలి అనే వ్యక్తికి విక్రయించాడని పోలీసులు తెలిపారు. నీరజ్ ఇంకా పరారీలో ఉన్నాడని వారు తెలిపారు. మాలి వారి వివాహ ఫోటోలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన తర్వాత ఆ అమ్మాయి ఆచూకీ అజ్మీర్‌లో ఉందని పోలీసులు తెలిపారు. 
 
కుర్రా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో అరవింద్ సింగ్ మాట్లాడుతూ, "17 ఏళ్ల బాలిక మే 2024లో అదృశ్యమైంది. ఆమెను అజ్మీర్‌కు తీసుకెళ్లి, అక్కడ మాలికి అప్పగించారు. ఆమె తండ్రి కుర్రా పోలీస్ స్టేషన్‌లో తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. మాలిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
 
నీరజ్ తనతో పెళ్లి కోసం అమ్మాయిని తీసుకొచ్చాడని, పెళ్లి చేసుకున్న తర్వాత వారు భార్యాభర్తలుగా జీవిస్తున్నారని మాలి పోలీసులకు చెప్పాడని అరవింద్ సింగ్ అన్నారు. ఆ అమ్మాయి వైద్య పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించిందని అరవింద్ సింగ్ చెప్పారు. నీరజ్‌ను అరెస్టు చేసిన తర్వాత వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు