టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినందుకు వంశీ మూల్యం చెల్లించుకుంటారని నారా లోకేష్ హామీ ఇచ్చారు. గన్నవరంలో ఎన్నికలకు ముందు ప్రచారంలో, లోకేష్ తగినంత దూకుడుగా వ్యవహరించారు. ఇంకా వంశీని హెచ్చరించారు. ప్రస్తుతం వంశీ అరెస్ట్ కావడంతో నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇకపోతే... ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్, ఆయన భార్య బ్రాహ్మణి ఈ నెల 17వ తేదీన ప్రయాగ్రాజ్కు బయలుదేరి వెళ్లనున్నారు. మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించనున్నారు.
అనంతరం వారాణశీకి బయలుదేరి వెళ్లనున్నారు. కాశీ క్షేత్రపాలకుడైన మహా కాలభైరవేశ్వరుడి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తరువాత కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకుంటారు. వారణాశి ఘాట్లను సందర్శించి, గంగా హారతిలో పాల్గొనే అవకాశం ఉంది.