మహిళను స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచి హత్య చేసిన వ్యక్తి.. ఎక్కడ?

ఠాగూర్

మంగళవారం, 3 జూన్ 2025 (09:54 IST)
తనను ప్రేమించలేదన్న కోపంతో ఓ మహిళను ఓ కిరాతకుడు స్క్రూ డ్రైవర్‌‌తో 18 సార్లు పొడిచి హత్య చేశాడు. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
శనివారం పశువులకు మేత తీసుకొచ్చేందుకు ఓ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు గాలించగా మరుసటి రోజు పంట పొలాల్లో రక్తపు మడుగులో కనిపించింది. ప్రేమిస్తున్నానంటూ వెంటపడిన వ్యక్తే సైరా అనే మహిళను స్క్రూడ్రైవరుతో 18 సార్లు పొడిచి.. చిత్రహింసలకు గురిచేసి దారుణంగా హత్య చేసినట్టు గుర్తించారు. 
 
మహిళ రహస్య భాగాలపై గాయాలు ఉండటంతో అత్యాచారం జరిగి ఉంటుందని తాము అనుమానించినప్పటికీ.. శవపరీక్షలో మాత్రం అలాంటిదేమీ జరగలేదని తేలినట్లు పోలీసులు వెల్లడించారు. సైరా మొబైల్ ఫోనులో ఐదు మిస్డ్ కాల్స్‌‍ను గుర్తించి.. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు అదే గ్రామానికి చెందిన రఫీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అయితే, ఈ యువకుడు తన కుమార్తెను వేధించేవాడని సైరా తల్లి సఫీనా పోలీసులకు చెప్పడంతో అతడిని కస్టడీలోకి తీసుకొని విచారించగా అసలు నిజం బయటపడింది. తానే సైరాను హత్య చేసినట్లు రఫీ అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
కొన్ని రోజుల క్రితం రఫీని "సైరాను ప్రేమిస్తున్నట్లు రఫీ చెప్పినా ఆమె అతడిని దూరం పెట్టింది. మరో వ్యక్తి కొట్టాడు. దీంతో తనను కొట్టిన వ్యక్తితో సైరా రిలేషన్‌షిప్ ఉన్నట్టు అనుమానించిన రఫీ.. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఆమె వెంటపడ్డాడు. ఈ క్రమంలోనే శనివారం సైరాను అనుసరించి పొలంలోకి వెళ్లి స్క్రూడ్రైవరుతో 18 సార్లు ఆమెపై దాడి చేశాడు. 
 
నొప్పితో ఆమె విలవిలలాడుతూ ప్రాణాల కోసం ప్రాధేయపడినా వదల్లేదు. ఆమె ప్రాణాలు విడిచిన తర్వాత నిందితుడు ఇంటికి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని నిద్రపోయాడు" అని పోలీసులు వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు