సన్నీ లియోన్‌కు మంత్రి వార్నింగ్... 3 రోజుల డెడ్‌లైన్

సోమవారం, 27 డిశెంబరు 2021 (09:47 IST)
బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్‌కు మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి నరోత్తమ్ మిశ్రా గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆమె నటించిన "మధుబన్ మేన్ రాధికా నాచే" పాటను నిషేధించాలంటూ హెచ్చరిక చేశారు. ఈ పాటలో ఆమె అసభ్యకరంగా ఉందని అందువల్ల ఆ పాటను నిషేధించాలంటూ హెచ్చరిక చేశారు. మూడు రోజుల్లో ఈ వీడియోను తొలగించాలంటూ ఆయన అల్టిమేటం జారీచేశారు. 
 
పాటలో అసభ్యకరమైన ఆమె నట హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని, అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవతామూర్తి అయిన రాధను అవమానపరిచేలా ఉందంటూ నెటిజన్లు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 
 
అఖిల భారత తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ సైతం తీవ్రంగా స్పందించారు పాటలోని అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేయడం ద్వారా సన్నీ లియోన్ బ్రిజ్ భూమి ప్రతిష్టను అవమానపరిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ఇదిలావుంటే, సన్నీ లియోన్ నటించి ఈ వీడియో మ్యూజిక్‌ ఆల్బన్‌ను బుధవారం సరేగమ మ్యూజిక్ విడుదల చేసింది. ఇందులో మధుబన్ పాటపైనే ప్రధానంగా వివాదం నెలకొంది. వాస్తవానికి ఈ పాటను తొలిసారిగా 1960లో కోహినూర్ చిత్రంలో మహ్మద్ రఫీ ఆలపించారు. 
 
"సన్నీ లియోన్ వీడియో ఆల్బమ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం" అని సంత్ నావల్ గిరి మహారాజ్ హెచ్చరించారు. పైగా, సన్నివేశాల్లో ఆమెను తప్పించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు