భువనేశ్వర్ పార్క్‌లోని 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి

సెల్వి

శుక్రవారం, 19 ఏప్రియల్ 2024 (20:55 IST)
White tigress Sneha
భువనేశ్వర్ శివార్లలోని నందన్‌కనన్ జూలాజికల్ పార్క్‌లో 14 ఏళ్ల తెల్లపులి స్నేహ మృతి చెందింది. ఈ తెల్లపులి గురువారం అస్వస్థతకు గురైంది. ఆ పులికి మందులు కూడా వాడారు. ఆమె వృద్ధాప్య వ్యాధులతో బాధపడింది. వేసవి వేడిగాలుల కారణంగా ఆమె పరిస్థితి మరింత దిగజారిందని.. ఆమెకు సెలైన్, మందులు వేసినా శుక్రవారం ఉదయం మృతి చెందింది.  
 
స్నేహా ఆగష్టు 5, 2016న మౌసుమి (ఆడ), చిను (మగ), అరుదైన మెలనిస్టిక్ విక్కీ (మగ) అనే మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె రెండవ గర్భధారణ సమయంలో లవ, కుశలకు జన్మనిచ్చింది. 
 
మార్చి 28, 2021న, ఆమె రాకేష్, రాకీ, బన్షి అనే మూడు సాధారణ మగ పులి పిల్లలకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం స్నేహా అనే తెల్లపులి ప్రాణాలు కోల్పోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు