ప్రశాంతంగా యూపీ మూడో దశ పోలింగ్... విజయం మాదే : రాజ్‌నాథ్

ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (10:36 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాగంగా మూడో దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో భాగంగా ఆదివారం ఉదయం లక్నోలోని ఓ పోలింగ్ కేంద్రంలో కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 
 
కాగా మూడో విడత పోలింగ్‌లో తాము ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని, మిగతా పార్టీలకన్నా సీట్ల పంపకాల సమీకరణ తమకు కలిసొచ్చే అంశమని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. యూపీ మూడోదశ పోలింగ్‌లో 69 స్థానాలకు గానూ మొత్తం 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి