కాగా, ఉత్తరప్రదేశ్లో మూడో దశ ఎన్నికల పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. యూపీ మూడోదశ పోలింగ్లో 69 స్థానాలకు గానూ మొత్తం 826 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.