మూత్రంతో కళ్లను సొంతం చేసుకున్న మహిళ..

ఠాగూర్

గురువారం, 26 జూన్ 2025 (18:36 IST)
ఆన్‌లైన్‌లో ఓ మహిళ చేసిన పని తీవ్ర దుమారం రేపుతోంది. ప్రతి రోజూ ఉదయం తన కళ్లను సొంత మూత్రంతో శుభ్రం చేసుకుంటానని చెబుతూ ఓ వీడియోను పంచుకోవడమే ఇందుకు కారణమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆరోగ్య నిపుణులు, సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనులు ఆరోగ్యానికి ప్రమాదకరమని వారు హెచ్చరిస్తున్నారు. 
 
నుపుర్ పిట్టీ అనే మహిళ తనను తాను 'మెడిసిన్- ఫ్రీ లైఫ్ కోచ్' (మందులు అవసరం లేని జీవిత శిక్షకురాలు)గా పరిచయం చేసుకుంది. ఈ వారం మొదట్లో ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. 'యూరిన్ ఐ వాష్ - ప్రకృతి ప్రసాదించిన ఔషధం' అనే క్యాప్షన్‌ను దానికి జోడించింది. ఈ వీడియోలో ఆమె తన మూత్రంతో కళ్లను శుభ్రం చేసుకోవడం కనిపించింది.
 
ప్రకృతి వైద్యం పేరిట ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడటం సరికాదని పలువురు వ్యాఖ్యానించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, కంటి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అశాస్త్రీయ పద్ధతులను ప్రోత్సహించవద్దని సూచిస్తున్నారు. శాస్త్రీయంగా నిరూపించబడని ఇలాంటి చిట్కాలను పాటించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు