గోమాతను పూజించడం ద్వారా కోటి పుణ్యల ఫలం పొందవచ్చు. కన్నతల్లి తర్వాత గోవునే మాతగా పిలుస్తారు. అలాంటి గోవును దానం చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. ప్రతి ఒక్కరూ జీవితకాలంలో మూడు గోవులను దానంగా చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాచేస్తే పుణ్యఫలంతో పాటు సమస్త దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా మరణానంతరం 'వైతరణి' నదిని దాటే క్రమంలో అత్యంత కష్టతరమైన ప్రయాణం చేయకుండా ఈ పుణ్య ఫలం అడ్డుపడుతుంది. ఇక గోవును దానం చేయడం వలన, కొన్ని వేల సంవత్సరాల పాటు పితృదేవతలు ఉత్తమ గతులను పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి.