పితృ దేవతలకు సద్గతులు కలిగి సుఖశాంతులు, వంశాభివృద్ధి కలగాలంటే మహాలయ అమావాస్య రోజు దానాలు చేయడం శ్రేష్ఠమని పండితులు చెబుతారు. అమావాస్య రోజు పూర్వీకులకు ఇష్టమైన పదార్థాలు నైవేద్యంగా పెట్టి వాటిని పది మందికి పండి పెడితే మంచిది. మహాలయ అమావాస్య రోజు బ్రాహ్మణుడికి గుమ్మడికాయ దానం చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు చెబుతారు.