ఒకే రాశిలో జన్మించిన ముగ్గురు ఒకే ఇంట్లో ఉన్నారా? సముద్ర తీరాల్లోని ఆలయాల్ని?

బుధవారం, 15 మార్చి 2017 (16:02 IST)
ఒకే కుటుంబంలో తల్లీదండ్రులు, సంతానం ఒకే రాశిలో జన్మించి వుంటే వారిని ఏకరాశికారులని అంటారు. ఒకే కుటుంబంలో తల్లిదండ్రులు ఏక రాశిలో పుట్టివుంటే.. ఏకకాలంలో ముగ్గురూ ఒకే వాహనంలో ప్రయాణించకూడదు. భార్యాభర్తలు ఒకే రాశికారులైతే అదే రాశిలో సంతానం కూడా జన్మిస్తే.. తప్పకుండా ఏలినాటి శని, అష్టమ శని జరుగుతున్న కాలంలో సముద్ర తీర ప్రాంతాల్లో వెలసిన సుప్రసిద్ధ ఆలయాలను దర్శించుకోవడం ఉత్తమం. 
 
రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచ్చందూర్‌లలో వెలసిన ఆలయాలను దర్శించుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఒకే రాశికి చెందిన వారు ఒకే కుటుంబంలో ముగ్గురు లేదా నలుగురు ఉన్నట్లైతే.. ప్రమాదాలు, నష్టాలు తప్పవు. అందుకే దశాకాలం, శని ప్రభావాలున్న సమయంలో పిల్లలను బంధువుల ఇంట ఉంచడం లేదా ఆ సమయంలో మాత్రం హాస్టల్‌లో చేర్చడం చేయొచ్చు.
 
అదే భార్యాభర్తలు ఒకే రాశికి చెందిన వారైతే.. ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌‍ఫర్ తీసుకోవచ్చు. ఇలా ఒకే రాశిలో ముగ్గురు లేదా నలుగురు ఇంట్లో ఉంటే ప్రతీ ఏడాది.. ప్రతి ఏడాదీ తిరుచ్చందూర్ కుమార స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. ఇంకా అష్టమ శని దశ, ఏలినాటి శని జరుగుతున్నప్పుడు ఒకే రాశికి చెందిన కుటుంబసభ్యులు ఒకే వాహనంలో ప్రయాణించడం చేయకూడదని పండితులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి