నిన్ను దలంచి పుస్తకము..

తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా
యుల్లంబందున నిల్చి జృంభణముగానుక్తుల్ సుశబ్దమ్ము శో
భిల్లంబల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
ఫుల్లాబ్జాక్షీ! సరస్వతీ! భగవతీ! పూర్ణేందుబింబాననా!

మనలో దాగి ఉన్న ఆత్మజ్యోతి ప్రకాశమే ప్రాణం. ఆ ప్రాణం మనలోని ప్రతి అణువులో ఉంది. ఆ శక్తినే మనం సరస్వతి అంటున్నాం. అప్పుడైనా, ఇప్పుడైనా జ్ఞనసంపదకే ప్రాధాన్యత. విద్య, జ్ఞానానికి ఎవరు ప్రాముఖ్యతనిస్తారో, వారికి అన్నీ సమకూరుతాయనడంలో సందేహం లేదు. సంపాదించాలన్నా, సంపాదించినదాన్ని సద్వినియోగం చేయాలన్నా కావలసినది బుద్ధిశక్తి.

వెబ్దునియా పై చదవండి