75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

సెల్వి

బుధవారం, 16 ఏప్రియల్ 2025 (20:25 IST)
Chandra babu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా విదేశాలకు వెళుతున్నారు. బుధవారం తన కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుండి అంతర్జాతీయ విమానంలో ప్రయాణిస్తారు. కానీ చంద్రబాబు ఫ్యామిలీ వెళ్లే గమ్యస్థానం వెల్లడించనప్పటికీ, చంద్రబాబు తన కుటుంబంతో కలిసి దాదాపు ఆరు రోజులు అనేక యూరోపియన్ దేశాలలో పర్యటిస్తారని నివేదికలు సూచిస్తున్నాయి. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఆయన పర్యటనను అధికారికంగా ప్రకటించింది. యూరోపియన్ పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత, చంద్రబాబు ఏప్రిల్ 22న ఢిల్లీకి తిరిగి వచ్చి, 23న కేంద్ర మంత్రులతో సమావేశమై, విజయవాడకు తిరిగి వస్తారని భావిస్తున్నారు.
 
 ఈ పర్యటన ఎందుకు అంత ప్రత్యేకమైనదంటే.. ఏప్రిల్ 20 చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు. తన "వజ్రోత్సవ" పుట్టినరోజును జరుపుకోవడానికి, ఆయన అధికారిక విధులు, ప్రజా కార్యక్రమాలకు దూరంగా తన కుటుంబంతో సమయాన్ని గడపాలనుకుంటున్నారు. 
 
నాలుగు దశాబ్దాలకు పైగా ప్రజా సేవలో - ఎక్కువగా ముఖ్యమంత్రిగా లేదా ప్రతిపక్ష నాయకుడిగా, గడిపిన ఆయన కుటుంబంతో గడిపే సమయం చాలామటుకు తగ్గడంతో.. తన 75వ పుట్టిన రోజును పురస్కరించుకుని ఫ్యామిలీతో గడపాలని నిర్ణయించుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు