ఫిబ్రవరి 14న వసంత పంచమి: విద్యార్థులు ఇలా చేస్తే?

సెల్వి

సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (15:35 IST)
ఈ ఏడాది వసంత పంచమిని ఫిబ్రవరి 14న జరుపుకోనున్నారు. వసంత పంచమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. వసంత పంచమి రోజు సరస్వతీ దేవి ఆరాధనకు ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఈ రోజున సరస్వతీ దేవిని ఆరాధించడం వల్ల ఆమె అనుగ్రహం, విద్యలో విజయం లభిస్తుంది. 
 
సరస్వతి పూజ తేదీ, సమయం: పంచమి తిథి ప్రారంభం - ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 02:41 నుండి.. ఫిబ్రవరి 14 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. పూజ సమయం - ఫిబ్రవరి 14 ఉదయం 06:17 గంటల నుంచి మధ్యాహ్నం 12:01 గంటల వరకు. 
 
ఈ రోజు వసంతకాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ రోజున ప్రజలు శీతాకాలానికి వీడ్కోలు పలుకుతారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ప్రజలు ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. సరస్వతీ దేవిని పూర్తి భక్తితో పూజిస్తారు. 
 
ఈ రోజున పాఠశాలలు, గృహాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రదేశాలలో సరస్వతీ దేవి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు సాయంత్రం నైవేద్యం, మంత్ర పఠనం, పసుపు అన్నం నైవేద్యం, సరస్వతీ పారాయణం మొదలైనవి నిర్వహిస్తారు. 
 
అమ్మవారి అనుగ్రహం పొందడానికి భక్తులు ఈ రోజున పంచామృతంతో అభిషేకం చేయాలి. వసంత పంచమి సందర్భంగా సరస్వతీ మాతను పూజించాలి. విద్యాపరంగా రాణించాలంటే.. విద్యార్థులు అమ్మ ముందు పుస్తకాలను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది. 
 
వసంత పంచమి రోజు పాఠశాల విద్య, సంగీతం, వ్యాపారం, కొత్త పని ప్రారంభించడానికి పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సరస్వతీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజు పసుపు చీరలు, పసుపు పువ్వులు సమర్పించండి. 
 
ఈ ప్రత్యేక రోజున, పాఠశాలలు, విద్యా విశ్వవిద్యాలయాలు మొదలైన వివిధ ప్రదేశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు