పరమేశ్వరుడు కొలువై వున్న శ్రీచక్ర పర్వతం

మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (23:00 IST)
కైలాసగిరి... హేమాద్రి, రజతాద్రి, సుషుమ్న కనకాచలము, దేవ పర్వతము, అమరాద్రి, సుమేరు అనే పేర్లతో విరాజిల్లుతుంది. ఈ పర్వతము రాజము పురాణప్రసిద్దము. పరమ శివుడు ఈ వెండికొండపై వేంచేసి త్రిలోకాలను రక్షిస్తున్నాడు. జగదాంబ, పార్వతీదేవి, సర్వమంగళగా సర్వజగత్తును తన మహిమోన్నతమైన శక్తిని కాపాడుతుంది. ఈ పర్వతానికి 'శ్రీచక్ర' అని కూడా వుంటారు. ఇది జ్ఞానానికి, మోక్షానికి గుర్తుగా భావిస్తారు.
 
ఇది శివుని తాండవలీలా ప్రదేశం. ఈ కొండ వింతవింతలుగా, వెండి, బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటుంది. నటరాజు యొక్క నాట్యలీలావిలాస కేంద్రం అంటూ మునులు, రుషులు కీర్తిస్తారు. ఎంతో ప్రయాలకు లోనై ఈ ప్రయాణం చేయాల్సి వుంటుంది. ఆర్థిక భారంతో పాటు శారీరక బాధలెక్కువ.
 
ఆరోగ్యంగా వున్నవారే ప్రయాణం చేయాలి. మానస సరోవరంలో స్నానం ఆత్మానందం కలిగిస్తుంది. ఆత్మశుద్ధికి దోహదపడుతుంది. జీవితంలో ఒక్కసారైనా మానస సరోవరం దర్శించి పరమేశ్వరుని అపార కరుణాకటాక్షాలు పొందాలని ప్రార్థించుదాం. ఓ నమశ్శివాయ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు