తిరుమల శ్రీవారికి మినీ బస్సు విరాళం

ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:36 IST)
తిరుమల శ్రీవారికి శనివారం ఒక మినీ బస్సు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ కంపెనీ సేల్స్ హెడ్ కె. మోహన్ ఈ మేరకు రూ.24 లక్షల విలువైన 34 సీట్లు గల మినీ బస్సును అందజేశారు.
 
తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట వాహనం తాళాలను ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హరీంద్రనాథ్‌కు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు