'గణేశ పురాణం', 'స్మృతి కౌస్తుభం' వంటి అనేక పవిత్ర గ్రంథాలలో చతుర్థి వ్రతం ప్రాముఖ్యతను ప్రస్తావించడం జరిగింది. అంగారక చతుర్థి రోజున భక్తులు గణేశుడిని, భక్తి- అంకితభావంతో పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ప్రతి వ్యక్తి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు.
భక్తులు చతుర్థి తిథి సూర్యోదయం నుండి వ్రతాన్ని ఆచరిస్తారు. సాయంత్రం గణేశ పూజ చేసి చంద్రుడిని చూసిన తర్వాత మాత్రమే వ్రతాన్ని విరమిస్తారు. భక్తులు వినాయకుడికి మోదకాలతో పాటు అనేక నైవేద్యాలు అర్పిస్తారు. 21 పత్రాలను సమర్పిస్తారు. ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. సంకటహర చవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలల పాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి.