వైభవోపేతంగా తిరుచానూరు పద్మావతి రథోత్సవం

శనివారం, 21 మే 2016 (12:34 IST)
తిరుచానూరు పద్మావతి అమ్మవారి రథోత్సవం వైభవోపేతంగా జరిగింది. వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఉదయం బంగారు రథోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) నిర్వహించింది. అమ్మవారిని సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన వేదపండితులు ఆ తరువాత వజ్రవైఢూర్యాలతో అలంకరించి రథంపై అధిష్టింపజేశారు. నాలుగు మాఢావీధుల్లో అమ్మవారిని వైభవంగా వూరేగించారు. రథోత్సవం సందర్భంగా తిరుమాఢా వీధుల్లోని చలువ పందిళ్ళను తితిదే అధికారులు తొలగించారు. 

వెబ్దునియా పై చదవండి