తితిదే పోటు, అదనపు పోటు కార్మికులకు ఈఓ ప్రశంసలు
గత మే నెలలో రికార్డు స్థాయిలో కోటికిపైగా లడ్డూలు తయారు చేసి తితిదే చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్న పోటు, అదనపు పోటులోని 482 మంది కార్మికులు, 16 మంది సహాయకుల సేవలను తితిదే ఈఓ సాంబశివరావు ప్రశంసించారు. పోటు కార్మికులు అద్భుతమైన సేవలు అందించారని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. పోటు కార్మికుల సేవలకు గుర్తింపుగా మొత్తం 498 మందికి ఒక్కొక్కరికి 2,500 ప్రోత్సాహకాన్ని ప్రకటించారు.