ఆస్ట్రేలియన్ ఓపెన్.. మిక్స్‌డ్ డబుల్స్‌లో ఓడిన సానియా మీర్జా

ఆదివారం, 29 జనవరి 2017 (12:40 IST)
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఫైనల్లో సానియా-ఇవాన్‌ డోడిగ్‌ జోడీ ఓటమి పాలైంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో ఇన్‌సీడెడ్‌ జోడీ స్పియర్స్‌, కోబల్‌ జోడీ చేతిలో 2-6, 4-6 తేడాతో సానియా జోడీ పరాజయం చవిచూసింది. ఈ ఏడాది తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను గెలుచుకుని సీజన్‌లో శుభారంభం చేయాలని భావించిన సానియా మీర్జాకు చుక్కెదురైంది. 
 
క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్‌తో కలసి ఫైనల్ వరకూ చేరిన సానియా, తుది మెట్టుపై బోల్తా పడింది. ఫైనల్లో అమెరికాకు చెందిన అబిగాలి స్పియర్స్, జువాన్ సెబాస్టియన్ కబాల్ జోడీ చేతిలో 6-2, 6-4 తేడాతో సానియా జోడీ పరాజయం పాలైంది. కాగా సానియా మీర్జా 2009లో తొలిసారిగా గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి