చైనా ఓపెన్‌ సిరీస్‌‌ నుంచి సైనా నిష్క్రమణ

గురువారం, 16 నవంబరు 2017 (13:52 IST)
చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ నుంచి సైనా నెహ్వాల్‌ నిష్క్రమించింది. ప్రిక్వార్టర్ ఫైనల్‌లో ఐదో సీడ్‌ క్రీడాకారిణి అకానె యామగుచి (జపాన్‌) చేతిలో 18-21, 11-21 తేడాతో ఓటమి పాలైంది. 
 
తొలిసెట్‌లో కొంతసేపు పోరాడిన సైనా, రెండో రౌండ్‌లో పూర్తిగా పట్టుకోల్పోయింది. ఫలితంగా ఈ టోర్నీ నుంచి ఆమె నిష్క్రమించింది. మరోవైపు పీవీ సింధు గురువారం ప్రిక్వార్ట్‌ ఫైనల్‌లో హాన్‌ యుయి (చైనా)తో తలపడనుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు