రియో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్కు ఒక రజత పతకాన్ని సాధించి పెట్టిన భారత షట్లర్ పీవీ సింధు రాష్ట్రీయతపై వివాదాస్పదం నెలకొంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సింధు తమ రాష్ట్రం వాసి అంటే.. కాదు తమ రాష్ట్రం వాసి అంటూ పోటీపడీ సన్మానాలు చేశాయి. రూ. కోట్లు ప్రోత్సాహక నగదు బహుమతులు ప్రకటించాయి.