రియో ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున స్టీపుల్ చేజ్ ఈవెంట్ అథ్లెట్ సుధా సింగ్కు జికా వైరస్ సోకినట్టు ప్రచారం సాగుతోంది. రియో నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఈమె వైరల్ జ్వరం, ఒంటి నొప్పులతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. బీపీ పడిపోయింది.
అయితే అది వైరల్ ఫీవర్ మాత్రమే కావచ్చని, జికా వైరస్ ఉండకపోవచ్చని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాక్టర్ ఎస్సార్ సరళ వెల్లడించారు. రియోలో సుధా రూమ్లోనే ఉన్న ఓపీ జైషా, కవితా రౌత్ కూడా ఇలాంటి లక్షణాలతోనే బాధపడుతుండటంతో వారికి ఇదే తరహా పరీక్షలు చేయనున్నారు.