రియో ఒలింపిక్స్ స్టీపుల్ చేజ్ ఈవెంట్ అథ్లెట్ సుధా సింగ్‌కు జికా వైర‌స్‌?

సోమవారం, 22 ఆగస్టు 2016 (16:27 IST)
రియో ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా భారత్ తరపున స్టీపుల్  చేజ్ ఈవెంట్‌ అథ్లెట్ సుధా సింగ్‌కు జికా వైరస్ సోకినట్టు ప్రచారం సాగుతోంది. రియో నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన ఈమె వైర‌ల్ జ్వ‌రం, ఒంటి నొప్పుల‌తో బాధ‌పడుతూ ఆసుప‌త్రిలో చేరింది. బీపీ పడిపోయింది.  
 
బ్రెజిల్ వెళ్లివ‌చ్చిన నేప‌థ్యంలో జికా వైర‌స్ ఉందేమో అన్న అనుమానంతో ఆమెను ఒంట‌రిగా ఉంచి ప్ర‌త్యేకంగా చికిత్స అందిస్తున్నారు. ఆమె ర‌క్తంలో ఆ వైర‌స్ ఉందా లేదా అని నిర్ధ‌ారించేందుకు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. దీంతో వెంట‌నే ర‌క్త ప‌రీక్ష‌ల కోసం ఆమె ర‌క్త న‌మూనాను తీసుకున్నారు. 
 
అయితే అది వైర‌ల్ ఫీవ‌ర్ మాత్ర‌మే కావ‌చ్చ‌ని, జికా వైర‌స్ ఉండ‌క‌పోవ‌చ్చ‌ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డాక్ట‌ర్ ఎస్సార్ స‌ర‌ళ వెల్ల‌డించారు. రియోలో సుధా రూమ్‌లోనే ఉన్న ఓపీ జైషా, క‌వితా రౌత్ కూడా ఇలాంటి ల‌క్ష‌ణాల‌తోనే బాధ‌ప‌డుతుండటంతో వారికి ఇదే తరహా పరీక్షలు చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి