ప్రీక్వార్టర్‌లో భారత బాక్సర్ మేరీ కోమ్ బోల్తా

గురువారం, 29 జులై 2021 (16:55 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో పతకం సాధించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలన్న దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ఫ్లై వెయిట్ (48-51 కిలోలు) కేటగిరిలో గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో మేరీ కోమ్ ఓటమిపాలైంది. 
 
కొలంబియాకు చెందిన ఇంగ్రిట్ వాలెన్సియా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. ఆరు పర్యాయాలు వరల్డ్ చాంపియన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కోమ్ ఈ బౌట్‌లో విజయం కోసం సర్వశక్తులు ఒడ్డినా ఫలితం లేకపోయింది. 
 
ప్రత్యర్థికి ధీటుగానే పంచ్‌లు కురిపించినా, పలు రౌండ్లలో కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వాలెన్సియా ఆధిపత్యం సాగించింది. ఫలితంగా ప్రీ క్వార్టర్ ఫైనల్ పోటీలో మెరీకోమ్ ఓటమిపాలై భారత్‌కు పతక ఆశలను చెరిపేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు