పారిస్ 2024 ఒలింపిక్స్‌: భారత్‌కు రెండో పతకం.. మెరిసిన మను

సెల్వి

మంగళవారం, 30 జులై 2024 (14:27 IST)
Paris Olympics 2024
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో భారతదేశం తన రెండవ పతకాన్ని కైవసం చేసుకుంది. షూటింగ్ జంట మను భాకర్- సరబోత్ సింగ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. వీరిద్దరూ 16-10 స్కోర్‌తో దక్షిణ కొరియా జట్టును ఓడించి, దేశానికి గర్వకారణంగా నిలిచి భారత్‌ పతకాల పట్టికలో అద్భుత ప్రతిభతో ర్యాంకును మెరుగుపరుచుకున్నారు.
 
ఒకే ఒలింపిక్ ఎడిషన్‌లో దేశానికి రెండు పతకాలు సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్న మను భాకర్‌కు ఈ విజయం ప్రతిష్టాత్మకంగా నిలిచింది. అంతకుముందు జరిగిన గేమ్స్‌లో, మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు