భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు సంచలన నిర్ణయం తీసుకుంది. బ్యాడ్మింటన్కు స్వల్ప విరామం తీసుకుంది. పాదం గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. చైనా మాస్టర్స్ సూపర్ 750 టోర్నీ తర్వాత సింధు మళ్లీ కోర్టులోకి అడుగుపెట్టలేదు. ఈ టోర్నీలో సింధు సెమీస్కే పరిమితమైంది. సింధు తాజా నిర్ణయంతో అర్కిటెక్ ఒపెన్, డెన్మార్క్ ఒపెన్, ఫ్రెంచ్ ఒపెన్కు దూరం కానుంది.