మొంథా తుపాను.. అప్రమత్తమైన తెలంగాణ.. రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకూడదు

సెల్వి

మంగళవారం, 28 అక్టోబరు 2025 (08:17 IST)
Cyclone Montha
మొంథా తుపాను ప్రభావంతో రాగల నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 
 
ఈ తుపాను ప్రభావం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ మీద పడకుండా చూడాలని, రైతాంగం ఎట్టి పరిస్థితుల్లో నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. అందుబాటులో ఉన్న టార్పాలిన్లను వినియోగించి ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం తడవకుండా చూడాలన్నారు. 
 
ధాన్యం కొనుగోళ్లలో అధికార యంత్రాంగం సమష్టిగా పని చేయాలని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 8,342 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, ఇప్పటి వరకు 4,428 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు