రియో ఒలింపిక్స్ క్రీడల్లో విజేతలుగా నిలిచిన పీవీ సింధు, సాక్షి మాలిక్లతో పాటు.. దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్), కోచ్ గోపీచంద్లకు బీఎండబ్ల్యూ కార్లను బ్యాడ్మింటన్ ఉపాధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ బహుకరించారు. వీటి బహుకరణ కార్యక్రమం హైదరాబాద్లో జరుగగా, ఆ సమయంలో సచిన్ను సాక్షి మాలిక్ కోరింది.