మహిళ డబుల్స్ ర్యాంకింగ్స్లో వరుసగా 80వారాల పాటు నెంబర్ వన్ క్రీడాకారిణిగా నిలిచి భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రికార్డు సృష్టించింది. గత సీజన్లో మార్టినా హింగిస్తో కలసి వోల్వో కార్ ఓపెన్ టైటిల్ గెలిచి నంబర్ వన్ ర్యాంక్ను కైవసం చేసుకున్న సానియా మీర్జా అప్పటి నుంచి అగ్రస్థానంలోనే కొనసాగుతూనే ఉంది.
సానియా సాధించిన ఘనతకు మహేష్ భూపతి, పీవీ సింధు, గుత్తా జ్వాలలు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. కాగా హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్లు కలసి 12 నెలల్లో ఏకంగా 13 టైటిళ్లు సొంతం చేసుకున్నారు. వరుసగా 41 మ్యాచ్లు గెలిచారు.