బొంబాయి రవ్వను జల్లించి, ఒక బాణాలిలో నెయ్యి వేసి కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. పావు లీటర్ నీరును బాగా మరిగించి అందులో ఈ వేయించిన రవ్వను ఉండలు కట్టకుండా కలుపుకోవాలి.
అందులో పంచదార, కలర్ వేసి బాగా కలిపి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. తరువాత అందులో యాలుకల పొడి వేసి కలిపి చిన్న ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.
తరువాత బియ్యం పిండిని మైదాని జల్లించుకోవాలి. ఇప్పడు పిండిని జారుగా కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి బాగా మరిగించాలి. ఉండలు చేసి పెట్టుకున్న కేసరిని పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీసేయాలి.