కావలసిన పదార్థాలు : మైదాపిండి... ఒక కేజీ బెల్లం... ఒక కేజీ బొంబాయి రవ్వ... ఒక కేజీ వెన్నపూస... 8 టీ. నూనె... తగినంత
తయారీ విధానం : మైదాను బాగా జల్లించాలి. బొంబాయిరవ్వను మైదాకు కలిపి వెన్నపూసను కరిగించి కలపాలి. ఈ పిండిలో కొద్దిగా నీళ్లుపోసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఈ పిండిని రెండు గంటలపాటు అలాగే ఉంచి గవ్వల అచ్చుతో గవ్వలు చేసుకోవాలి. పొయ్యిమీద బాణలిపెట్టి తగినంత నూనె పోసి బాగా కాచాలి.
అందులో ఈ గవ్వలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. గిన్నెలో బెల్లం వేసి తగినన్ని నీళ్లుపోసి తీగమాదిరిగా పాకం వచ్చేలా చేయాలి. తరువాత ఈ పాకాన్ని స్టవ్మీద నుంచి కిందకు దించి వేయించి ఉంచుకున్న గవ్వలను అందులో వేసి, మొత్తం గవ్వలన్నింటికీ పాకం పట్టేలా బాగా కలియబెట్టాలి. అంతే బెల్లం గవ్వలు రెడీ అయినట్లే...!