తెలంగాణ ఎన్నికల ఫలితాలు : తొలి ఫలితం వెల్లడి... ఆ అభ్యర్థి గెలుపు

మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:07 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా తొలి ఫలితం వెల్లడైంది. హైదరాబాద్ చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఓవైసీ విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో వెల్లడైన తొలి ఫలితం ఇదే కావడం గమనార్హం. 
 
ఇకపోతే, మొత్తం 119 అసెంబ్లీ సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో అధికార తెరాస 89 స్థానాల్లో కాంగ్రెస్ 15, బీజేపీ 4, ఎంఐఎం 5, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
అలాగే, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గర్, మిజోరం రాష్ట్రాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో ఉంది. ఈ నాలుగు చోట్ల బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు