పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు. "నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్ నిర్దోషి, అమాయకుడని" స్వప్న సంచలన చేశారు.
పూర్ణచందర్పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ తనను మానసికంగా టార్చర్ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్ను బ్లాక్మెయిల్ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు స్వేచ్ఛ మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.