బాలాపూర్‌లో దారుణ ఘటన: మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి

సెల్వి

సోమవారం, 21 ఏప్రియల్ 2025 (15:57 IST)
హైదారాబాద్, బాలాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మత్తు ఇంజెక్షన్లు, టాబ్లెట్లను ముగ్గురు విద్యార్థులు ఒకేసారి తీసుకున్నారు. మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
అయితే సాహిల్ అనే వ్యక్తి ఈ విద్యార్థులకు మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించారు. ఒకేసారి ఇంజెక్షన్‌తో పాటు టాబ్లెట్లు తీసుకున్న నసర్ సహా మరో ఇద్దరు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 
 
ఈ ముగ్గురికి మెడికల్ డ్రగ్స్ అమ్మిన సాహిల్ అనే మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాహిల్‌ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకొని యువకుడు మృతి

హైదరాబాద్ లోని బాలాపూర్ లో ఘటన

ఇంటర్ చదువుతున్న మృతుడు అబ్దుల్ నసర్

ఒకేసారి ఇంజెక్షన్ తో పాటు టాబ్లెట్లు తీసుకున్న నసర్ సహా మరో ఇద్దరు విద్యార్థులు

మరో ఇద్దరు యువకుల పరిస్థితి కూడా విషమం

ఈ ముగ్గురికి మెడికల్ డ్రగ్స్ అమ్మిన… pic.twitter.com/0zA6qS2Bpe

— BIG TV Breaking News (@bigtvtelugu) April 21, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు