ఏపీలో తయారవుతున్న కేసీఆర్ విగ్రహాలు, ఆర్డరిచ్చింది ఎవరు, ఎందుకు?

ఐవీఆర్

శనివారం, 16 మార్చి 2024 (14:01 IST)
కర్టెసి-ట్విట్టర్
కేసీఆర్. భారాస వ్యవస్థాపక అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విగ్రహాలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అదికూడా తెలంగాణలో తయారైనవంటే సరేగానీ ఈ విగ్రహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో రెడీ అవుతున్నాయి. ఈ విగ్రహాలను పోస్ట్ చేసింది తయారు చేస్తున్నావారా లేక వాటిని చూసినవారా అనేది తెలియరాలేదు. ఐతే వీటిని చూసినవారు ఫన్నీ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఆర్డర్ క్యాన్సిల్ చెయ్యమని చెప్పలేదా రామకృష్ణా అంటూ కామెడీ డైలాగులు పోస్ట్ చేస్తున్నారు.
 
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కీలక నాయకుడు, ఒక దశలో ఆయనను తెలంగాణ జాతిపిత అని కూడా కొనియాడారు. ఐతే ఆ తర్వాత క్రమంగా ఆయన ఇమేజ్ తగ్గుతూ వచ్చింది. మొన్న జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ భారాస ఘోర పరాజయాన్ని చవిచూసింది. ప్రస్తుతం పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తూ కేసీఆర్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంలో ఈడీకి చిక్కారు.
 

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో కేసీఆర్ విగ్రహాలు తయారీ pic.twitter.com/fgnXkQKvN9

— HEMA NIDADHANA (@Hema_Journo) March 16, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు