Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ఛార్జీలు పది శాతం తగ్గింపు

సెల్వి

మంగళవారం, 20 మే 2025 (14:34 IST)
ప్రయాణికులకు ఉపశమనం కలిగించే చర్యగా, హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ఇటీవల పెరిగిన టికెట్ ఛార్జీలను సవరించాలని కీలక నిర్ణయం ప్రకటించారు. కొత్తగా పెంచిన మెట్రో రైలు ఛార్జీలను 10 శాతం తగ్గిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది.
 
ఛార్జీల పెంపు తర్వాత ప్రయాణీకులు లేవనెత్తిన అభ్యంతరాలు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకోబడింది. సవరించిన ఛార్జీలు మే 24 నుండి అమల్లోకి వస్తాయి. 
 
మెట్రో సేవలపై ఆధారపడే వేలాది మంది రోజువారీ ప్రయాణికులు ఈ ఛార్జీల సర్దుబాటు ద్వారా ప్రయోజనం పొందుతారని భావిస్తున్నారు. గతంలో, పెంచిన ఛార్జీలు మే 17 నుండి అమల్లోకి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు