అనుమానం.. భార్య-బిడ్డను హత్యచేసి.. రైలు ముందు నిల్చుని ఆత్మహత్య

సెల్వి

సోమవారం, 22 జులై 2024 (10:04 IST)
భార్యపై అనుమానంతో సికింద్రాబాద్‌లోని బోవెన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి తన నివాసంలో తన భార్యను, 10 నెలల కుమార్తెను హత్య చేశాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను గుర్తించారు.
 
వివరాల్లోకి వెళితే.. గణేష్ తన భార్య స్వప్న, కుమార్తె నక్షత్రాలను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భార్య తీరుపై అనుమానం రావడంతో సదరు వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఈ కుటుంబం సికింద్రాబాద్‌లో నివాసం వుంటుంది. నిందితుడు ఆటో డ్రైవర్. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టినట్లు బోవెన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు అధికారి తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు