రోడ్డు ప్రమాదంలో మిస్టర్ తెలంగాణ విజేత సోహైల్ మృతి

సెల్వి

బుధవారం, 10 జులై 2024 (22:17 IST)
Mr Telangana Mohd Sohail
సిద్దిపేటకు చెందిన బాడీబిల్డింగ్ ఛాంపియన్, మిస్టర్ తెలంగాణ విజేత, సిద్దిపేటకు చెందిన మహ్మద్ సోహైల్ (23) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఈ విషాధ ఘటన ఆయన ఫ్యాన్సుకు షాకిచ్చేలా చేసింది. 
 
సోహైల్, అతని స్నేహితుడు మహ్మద్ ఖదీర్ (23) జూన్ 29న ద్విచక్ర వాహనంపై సిద్దిపేట నుంచి మిరుదొడ్డి వైపు వెళ్తున్నారు. మిరుదొడ్డి సమీపంలో బైక్ నడుపుతున్న సోహైల్ అదుపు తప్పి ఆటో రిక్షాను ఢీకొట్టాడు.
 
ఈ ప్రమాదంలో సోహైల్‌, ఖదీర్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. సోహైల్ తన కెరీర్‌లో అనేక జిల్లా-స్థాయి, రాష్ట్ర-స్థాయి, దక్షిణ భారత-స్థాయి బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు.
 
మిస్టర్ తెలంగాణ ఛాంపియన్‌షిప్‌ను కూడా గెలుచుకున్నాడు. బాడీబిల్డింగ్‌లో గొప్ప భవిష్యత్తు ఉన్న గొప్ప స్నేహితుడిని అతి చిన్న వయసులోనే కోల్పోయామని అతని స్నేహితుడు అఫ్రిది వాపోయాడు. కేసు నమోదు చేసుకున్న మిరుదొడ్డి పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు