ఫోటో కర్టెసీ- ఇన్స్టాగ్రాం
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటకు చెందిన తెలుగు యూట్యూబర్, ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్ను గురువారం రాత్రి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. అతడు ఆమధ్య కాలంలో 2 నెలల పాటు పాకిస్తాన్ దేశంలో పర్యటించడం, గూఢచర్యం ఆందోళనలకు సంబంధించి ఈ అరెస్టు జరిగిందని అధికారులు తెలిపారు. యాదవ్ ఇటీవల తన యూట్యూబ్ ఛానెల్లో జోడించిన మోటార్సైకిల్ పాకిస్తాన్ పర్యటన జాతీయ భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ముఖ్యంగా భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య, యాదవ్ తన పర్యటనలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడ్డారా లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నారా అని NIA దర్యాప్తు చేస్తోంది.