కానీ వెంటనే స్పందించిన ప్రయాణీకులు రైల్వే సిబ్బంది అతనిని కాపాడారు. కొంచెం అటు ఇటు అయితే ఆ వ్యక్తి ప్రాణాలు పోయేవని అధికారులు తెలిపారు. వరంగల్కు చెందిన మణిదీప్ అనే యువకుడు బెంగళూరు వెళ్లేందుకు కాచిగూడకు చేరుకున్నాడు. టికెట్ తీసుకుని అవసరంలో ఏసీ ఫస్ట్ క్లాస్ భోగీలో ఎక్కేశాడు. అయితే రైలు కదులుతుండగా కిందకు దిగేశాడు. దీంతో అతడి కాలు జారి రైలు కిందపడిపోయాడు.
అయితే అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎస్ కానిస్టేబుల్ సుస్మిత, అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గోవిందరావు, తోటి ప్రయాణీకులు అతడిని పక్కకు లాగి రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ప్రమాదం నుంచి ప్రయాణీకుడిని కాపాడిన రైల్వే ఉద్యోగులను నెటిజన్లు, స్థానికులు, రైల్వే ఉన్నతాధికారులు అభినందించారు.