హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి ఫ్లై ఓవర్పై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పదో తరగతి పరీక్ష రాసి వస్తున్న ఓ విద్యార్థిని మృత్యువాతపడింది. ఆర్టీసీ డబుల్ డెక్కర్ బస్సు చక్రాల కిందపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో ఆమె అన్నకు కూడా గాయాలయ్యాయి. మృతురాలిని ప్రభాతి ఛత్రియ (16)గాను, క్షతగాత్రుడుని ఆమె అన్న సుమన్ ఛత్రియగా గుర్తించారు.
ఈ ఘటనను చూసిన ప్రత్యక్ష సాక్షులు తీవ్ర షాక్కు గురయ్యారు. పరీక్ష రాసి ఇంటికి తిరుగుపయనమైన విద్యార్థిని అకాలమరణం చెందడంతో అక్కడే ఉన్న పాదాచారులు, ఇతర ద్విచక్రవాహనదారులు తీవ్ర షాక్కు గురయ్యారు. ఈ ప్రమాదం మరోమారు ద్విచక్రవాహనదారుల భద్రతపై పలు సందేహాలు రేపుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ప్రభాతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.