తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కర్రెగుట్ట కొండలపై గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్ల మరణాన్ని పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. అయితే భద్రతా దళాలు 'ఆపరేషన్ కాగర్'లో భాగంగా మావోయిస్టులపై భారీ దాడి ప్రారంభించినందున నక్సలైట్ల వైపు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గత మూడు రోజులుగా కర్రెగుట్ట అడవుల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్, ఛత్తీస్గఢ్కు చెందిన బస్తర్ ఫైటర్స్, మహారాష్ట్రకు చెందిన సి-60 దళాలతో సహా 10,000 కంటే ఎక్కువ పారామిలిటరీ దళాలు పాల్గొన్నాయని చెబుతున్నారు. భద్రతా దళాలకు లాజిస్టిక్ మద్దతు కోసం కర్రెగుట్ట కొండల దగ్గర బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ప్రాంతం నిఘా కోసం డాగ్ స్క్వాడ్లు, మానవరహిత డ్రోన్లు,భారత వైమానిక దళ హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు. బస్తర్ రేంజ్ ఐపీ సుందర్రాజ్ పి, సిఆర్పిఎఫ్ ఐజీ (ఛత్తీస్గఢ్) రాకేష్ అగర్వాల్ మరియు సీనియర్ అధికారులు ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు హిడ్మా, పెద్ద సంఖ్యలో నక్సలైట్లు మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా పరిగణించబడే కర్రెగుట్ట కొండలపై ఆశ్రయం పొందారని సమాచారం. కర్రెగుట్ట అడవులలోని సవాలుతో కూడిన భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా, భద్రతా దళాలకు ఆపరేషన్ నిర్వహించడం కష్టంగా మారవచ్చు.
ఇదిలా ఉండగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) మల్టీ జోన్-1, ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కర్రెగుట్ట అడవుల్లో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను ఛత్తీస్గఢ్ పోలీసులు, సిఆర్పిఎఫ్ నిర్వహిస్తున్నాయని అన్నారు. ఇందులో తెలంగాణ ప్రమేయం లేదని, పోలీసులు లేదా గ్రేహౌండ్స్ ప్రమేయం లేదన్నరు.