నర్సు సిబ్బంది నియామకం.. 30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్

శుక్రవారం, 29 డిశెంబరు 2023 (13:37 IST)
నర్సు సిబ్బంది నియామకం కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తెలిపింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ఆవరణలో ఈ వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:1.25 పద్ధతిలో జరుగుతుందని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు తాత్కాలిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం కూడా అందించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకున్నా లేదా అవసరమైన పత్రాలు సమర్పించకున్నా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫర్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రభుత్వం మరో 1,890 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కి చేరింది. ఈ నెల 18న ఫలితాలు విడుదలయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు