హైదరాబాద్ నగరం పాతబస్తీలోని బండ్లగూడలో విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్ షాక్ తగిలి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో షాక్ తగిలి ప్రమాదం జరిగింది.
మరోవైపు, అంబర్ పేట్లో రామ్ చరణ్ అనే యువకుడు ఇదేవిధంగా విగ్రహం తరలిస్తుండగా, అడ్డు వచ్చిన విద్యుత్ తీగలను తొలగిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురైన ప్రాణాలు కోల్పోయాడు.