అరుణాచలం గిరి ప్రదక్షణకు పెట్టింది పేరు. పౌర్ణమి రోజున గిరి ప్రదక్షణ చేస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం గురు పూర్ణిమ కావడంతో సింహాచలం ఆలయంలో గిరిప్రదక్షిణ చేశారు. అలా గిరి ప్రదక్షణ పూర్తి చేసుకుని భక్తులు తమ ఇళ్లకు వెళ్లడం ప్రారంభించినప్పుడు పెందుర్తి మండలంలోని వేపగుంట ప్రధాన రహదారి వద్ద ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.