హైదరాబాద్‌లో పోలీసుల కొరఢా : 353 మంది మందుబాబులకు జైలుశిక్ష

బుధవారం, 28 జులై 2021 (16:04 IST)
మందు బాబులపై హైదరాబాద్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తూ వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేశారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‎లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష పడింది. డ్రండ్ అండ్ డ్రైవ్ కేసులను విచారణ జరిపిన కోర్టు.. ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా, భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, కూకట్‎పల్లిలో 79, మియాపూర్ 60, మాదాపూర్ 41, బాలానగర్ 49, రాజేంద్రనగర్ 30, శంషాబాద్ 24, గచ్చిబౌలిలో 50 మంది మందు బాబులకు జైలు శిక్ష పడింది. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‎కు ఆర్‎టీవో అధికారులకు పోలీసులు లేఖను పంపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు