తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు

శనివారం, 7 అక్టోబరు 2023 (14:59 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త కోర్టులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
మొత్తం 57 కోర్టులను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యతో పాటు కొత్త కేసుల సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న కోర్టులపై కూడా పనిభారం పెరిగింది. 
 
ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొత్తగా 57 కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 
 
చిన్నారులపై నేరాల విచారణకు ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. ఇందులో ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, సంగారెడ్డి, నల్గొండ, ఎల్బీనగర్, వరంగల్ ప్రాంతాలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు