హైదరాబాద్ నగరంలో దారుణం ... మాజీ విలేకరిని కిడ్నాప్ చేసి చంపేశారు...

సోమవారం, 17 ఏప్రియల్ 2023 (12:06 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. మాజీ విలేకరిని కిడ్నాప్ చేసి చంపేశారు. మాజీ విలేఖరిని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ ఘట హైదరాబాద్ శివారు ప్రాంతమైన కొత్తూరు పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన కథనం మేరకు... మల్లాపూర్ గ్రామానికి చెందిన మామిడి కరుణాకర్ రెడ్డి (29) ఓ పత్రికలో విలేకరిగా పనిచేసేవాడు. కొద్దినెలల క్రితమే మానేశాడు. ప్రస్తుతం కొత్తూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. 
 
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి తన ఇంటి పక్కన ఉండే శ్రీధర్ రెడ్డితో కలిసి కారులో చేగూరు నుంచి తిమ్మాపూర్ వైపు వస్తుండగా మార్గంమధ్యలో తీగాపూర్ వద్ద కాపు కాసిన దుండగులు వారిని అడ్డగించి కారు అద్దాలను ధ్వంసం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు