సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం: మూడు ఫ్యాక్టరీల్లో మంటలు

శనివారం, 17 ఆగస్టు 2019 (08:16 IST)
సంగారెడ్డి జిల్లాలోని పాశ మైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో ఎవరూ లేరు. ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
 
పాశ మైలారం పారిశ్రామిక వాడలో పలు ఫ్యాక్టరీలు ఉన్నాయి.  కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఈ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆరు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
 
ఈ ప్రమాదం జరిగడానికి గల కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ నుండి మంటలు పక్కనే ఉన్న మరో రెండు ఫ్యాక్టరీలకు కూడ వ్యాపించాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు